అందాల రాక్షసి సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ లావణ్య. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ బెంగాలీ అమ్మాయి , ఆ తర్వాత దుసుకేల్తా , భలే భలే మగాడివోయ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.ప్రస్తుతానికి అల్లు శిరీష్ సరసన నటిస్తున్న లావణ్య త్వరలోనే ఇంకో మెగా హీరో తో జత కట్టనుంది.
వివరాల్లోకి వెళితే , వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఇప్పటికే శ్రీను వైట్ల ఒక లైన్ వినిపించాడు , ఈ సబ్జెక్టు ని వైట్ల - గోపి మోహన్ కలిసి డెవలప్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా లో హీరోయిన్ గా లావణ్య ని ఎన్నుకున్నారు.
మార్చ్ నుండి మొదలయ్యే ఈ సినిమా కి నిర్మాత ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కంచె సినిమా తర్వాత వరుణ్ చాల సినిమాలు అనుకున్నాడు కాని , ఆఖరికి శ్రీను వైట్ల కె ఫిక్స్ అయ్యాడని ఫిల్మ్ నగర్ సమాచారం. మొత్తానికి లావణ్య , మెగా క్యాంపు నుండి బయటకి రాకుండా బానే ఉంటుంది అని కామెంట్లు వేస్తున్నారు విశ్లేషకులు.


No comments: