బన్నీ మీద మెగా ఫాన్స్ ఫైర్ అవ్వడం ఏంటి అని షాక్ అవుతున్నారా ? ఇది నిజమేనండి బాబు , వివరాల్లోకి వెళితే బన్నీ ఆఖరి చిత్రం రుద్రమ దేవి అక్టోబర్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా రామ్ చరణ్ బ్రూస్ లీ కి చాల దగ్గరలో విడుదల అవ్వడం పెద్ద దుమారమే రేగింది. బన్నీ కావాలని సినిమా ని పోటి గా దించాడని కొంత మంది మెగా ఫాన్స్ ఆరోపించారు కాని బన్నీ ప్రెస్ కి అన్ని వివరాలు చెప్పాడు.
అనుకోకుండా సినిమా ఆ తేది కి రావాల్సి వచ్చిందని , అందులో తప్పేమీ లేదని చల్లగా జారుకున్నాడు.ఆ సంఘటను మెగా ఫ్యాన్స్ మరువకముందే బన్నీ మళ్ళి కొత్త వివాదం తీసుకొచ్చేలా ఉన్నాడు.బన్నీ కొత్త సినిమా సరైనోడు ని ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకో వైపు అదే డేట్ కి అటు ఇటు గా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అవ్వనుంది. ఇప్పటికే చరణ్ సినిమా కి పోటిగా దిగిన బన్నీ , ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కి పోటి రావడం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. ఈ విషయం మీద బన్నీ ఇంకా ఎం మాట్ల్దకపోయిన , ఫిల్మ్ నగర్ సమాచారం అయితే , రెండిట్లో ఏదో ఒక సినిమా ఏప్రిల్ 8 న విడుదల అవుతుందని , ఇంకో సినిమా 12 న విడుదల అయ్యే అవకశం ఉందని అంటున్నారు. ఇదే నిజం అయితే , మెగా ఫ్యాన్స్ బన్నీ మీద కోపం తగ్గించుకుంటారు. ఏది ఏమైనా బన్నీ మాత్రం మళ్ళి వివాదం లోకి వెళ్ళాడు అనేది నిజం.


No comments: