టాలీవుడ్ దర్శకులలో క్రిష్ డి భిన్నమైన శైలి అని చెప్పాలి . తొలి సినిమా గమ్యం నుండి మొన్నటి కంచె వరకు వినుత్నమైన సినిమా చేసుకుంటూ వచ్చాడు క్రిష్. అయితే క్రిష్ కి గమ్యం తర్వాత కమర్షియల్ హిట్లు లేవు. తాజాగా వచ్చిన కంచె ఒక్కటి క్రిష్ కి ఊరటని ఇచ్చింది. కంచె సినిమా తో వరుణ్ కూడా మంచి హీరో గా పేరు తెచ్చుకున్నాడు. మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అందరు భావించారు. దానికి తగ్గట్లు గా క్రిష్ , రాయభారి అనే కథను వరుణ్ తేజ్ కోసం ప్రత్యేకంగా తాయారు చేసాడు.
సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి అన్ని సన్నాహాలు జరిగాయి.సినిమా లాంచ్ చేద్దాం అనే టైం కి ఈ సినిమా ని వాయిదా వేస్తున్నట్లు క్రిష్ ప్రకటించాడు. ఈ సినిమా కి లొకేషన్స్ సరిగ్గా దొరకట్లేదని ,అందుకే తర్వాత తీస్తున్నట్లు ప్రకటించారు. కాని వివరాల్లోకి వెళితే అస్సలు కారణం వేరే అని తెలుస్తుంది. సినిమా కి బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్లే వరుణ్ వోద్దన్నాడని సమాచారం. తన మార్కెట్ ఇంకా పెరగలేదని , తర్వాత చేస్తే బెటర్ అని చెప్పడం తో రాయభారి సినిమా ఆగిపోయింది. ఏది ఏమైనా నిర్మాతల కోసం వరుణ్ తేజ్ సినిమా ఆపడం నిజంగా గొప్ప విషయమే .


No comments: