మోహన్ బాబు కి అన్న గారు రామ రావు అంటే ఎంత అభిమానం అనేది మనకు తెలిసిందే. ఈరోజు ప్రెస్ తో మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. అన్న గారు చెప్పుడు మాటలు వినే మనిషి కాదని , ఆయన లాగ ఈరోజుల్లో ఎవరు ఉండరని మోహన్ బాబు తెలిపాడు.
ఒకసారి న గురించి ఒక హీరోయిన్ అన్నగారికి ఎన్నో మాటలు చెప్పింది , మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టలనుకుంది కాని అన్న గారు మాత్రం ఎవరి మాట వినలేదు. ఆయన లాంటి మనిషి ఈ జేనేరేషణ్ లో చూడలేదని చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.పని లో పని గా బాలకృష్ణ గురించి కూడా మోహన్ బాబు మాట్లాడటం విశేషం.
బాలయ్య తన తండ్రి లాగానే ముక్కుసూటి గా పోయే మనిషని , బాలకృష్ణ ఎం ఎల్ ఏ గా చేస్తున్న సేవలు అద్భుతం అని కొనియాడారు మోహన్ బాబు. బాలకృష్ణ లాంటి ఎం ఎల్ ఏ లు స్టేట్ కి 5 గురు ఉంటె దేశం అభివృద్ధి లోకి వెళ్తుందని మోహన్ బాబు చెప్పడం కొసమెరుపు. మొత్తానికి మోహన్ బాబు తనకు ఇష్టమైన అన్నగారి గురించి మరోసారి ప్రస్తావించారు.


No comments: