మొత్తానికి భూ సేకరణ ప్రక్రియ కి శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి లో నాలుగు వేల ఎకరాలకు దగ్గర గా ఉన్న భూములు మీద నోటిఫికేషన్ ఇందాక జారీ అయ్యింది. తొలి విడత లో ల్యాండ్ అక్విజిషన్ ప్రకటన ఇస్తున్న గ్రామాలన్నీ తూల్లూరు మండలం లో ఉనడడం తో వాటికి సంబంధించిన ప్రకటన వెలువడింది. తూళ్ళూరు ప్రాంతం లో ఈ నోటిఫికేషన్ వెలువడ్డాక ఉద్రిక్త పరిస్థిత నెలకొంది.ల్యాండ్ పూలింగ్కు గడువు ముగిసింది. దీంతో ఇక సేకరణ చేపట్టాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను శుక్రవారం జారీ చేయనుంది. ల్యాండ్పూలింగ్ ద్వారా ఏపీ సర్కారు ఇప్పటికే సుమారు 33 వేల ఎకరాలు సేకరించింది. మరో ఐదారు వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటోంది. సమీకరణకు సమయమిచ్చినా రైతులు ముందుకు రాలేదు. దీంతో భూ సేకరణ చట్టం ప్రయోగించి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ సేకరణకు దిగితే ఉద్యమం తప్పదని రైతన్నల హెచ్చరిస్తున్నారు. అటు... వివిధ పార్టీలు ఉద్యమకార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు అంటే 95 % పైగా భూమి ప్రభుత్వం చేతిలోనే ఉంది కానీ ఈ నాలుగు వేల ఎకరాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దానికి కూడా ఒక కారణం ఉంది మిగితా ఐదు శాతం లో మూడు శాతం న్యాయపరమైన చిక్కుల వలన ఆగిపోయింది.
మొత్తానికి భూ సేకరణ ప్రక్రియ కి శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి లో నాలుగు వేల ఎకరాలకు దగ్గర గా ఉన్న భూములు మీద నోటిఫికేషన్ ఇందాక జారీ అయ్యింది. తొలి విడత లో ల్యాండ్ అక్విజిషన్ ప్రకటన ఇస్తున్న గ్రామాలన్నీ తూల్లూరు మండలం లో ఉనడడం తో వాటికి సంబంధించిన ప్రకటన వెలువడింది. తూళ్ళూరు ప్రాంతం లో ఈ నోటిఫికేషన్ వెలువడ్డాక ఉద్రిక్త పరిస్థిత నెలకొంది.ల్యాండ్ పూలింగ్కు గడువు ముగిసింది. దీంతో ఇక సేకరణ చేపట్టాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను శుక్రవారం జారీ చేయనుంది. ల్యాండ్పూలింగ్ ద్వారా ఏపీ సర్కారు ఇప్పటికే సుమారు 33 వేల ఎకరాలు సేకరించింది. మరో ఐదారు వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటోంది. సమీకరణకు సమయమిచ్చినా రైతులు ముందుకు రాలేదు. దీంతో భూ సేకరణ చట్టం ప్రయోగించి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ సేకరణకు దిగితే ఉద్యమం తప్పదని రైతన్నల హెచ్చరిస్తున్నారు. అటు... వివిధ పార్టీలు ఉద్యమకార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు అంటే 95 % పైగా భూమి ప్రభుత్వం చేతిలోనే ఉంది కానీ ఈ నాలుగు వేల ఎకరాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దానికి కూడా ఒక కారణం ఉంది మిగితా ఐదు శాతం లో మూడు శాతం న్యాయపరమైన చిక్కుల వలన ఆగిపోయింది.


No comments: