అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయి కి పెళ్లి అయ్యి పాపా కూడా పుట్టేసింది. అయితే , వీరు ఇద్దరు కలిసి నటించి చాల ఏళ్ళు అయిపొయింది. ఐశ్వర్య రాయి ఇటివల ఒక సినిమా తో మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే వీరిద్దరూ కలిసి మళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తారని సమాచారం.
వివరాల్లోకి వెళితే , అభిషేక్ బచ్చన్ హౌస్ ఫుల్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన సన్నివేశం లో ఐశ్వర్య రాయి కనిపించాలి. నిజానికి దర్శకుడు , ఐశ్వర్య రాయి మైనపు బొమ్మ చూపించాలి . ఆ మైనపు బొమ్మ వెనకాల అభిషేక్ బచ్చన్ దాక్కుంటాడు.
ఈ సీన్ లో నిజంగా ఐశ్వర్య రాయి ని పెడితే , సీన్ బాగా పండుతుందని దర్శకుడి ఆలోచన.ఏది ఏమైనా , అభిషేక్ , ఐశ్వర్య జంట ని మళ్ళి స్క్రీన్ మీద కలిసి చూసే అవకాశం అయితే దక్కింది.ఈ సినిమా అయిన అభిషేక్ కి మంచి హిట్ ఇస్తుందేమో చూద్దాం.


No comments: