మలయాళీ భామ నిత్య మీనన్ ప్రస్తుతానికి దక్షిణాది భాషల్లో చాల బిజీ గా ఉంది. ఎలాంటి పాత్ర అయిన అద్భుతంగా చేసే నిత్య మీనన్ చాల తక్కువ కలం లోనే చాల మంచి పేరు తెచ్చుకుంది . తెలుగు లో అలా మొదలయింది సినిమా తో పరిచయం అయిన నిత్య మీనన్ ,
అప్పట్లో ఒక వివాదం లో ఇరుక్కుంది.
ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ ఎవరో తనకు తెలీదని నిత్య చెప్పడం విశేషం. అప్పట్లో ఈ వివాదం మీద ప్రభాస్ ఫాన్స్ చాల గట్టిగానే రియాక్ట్ అయ్యారు.ఈ విషయం మీద ఇటివల జరిగిన ఒక టి వి ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చింది నిత్య మీనన్.అలా మొదలయ్యింది సినిమా టైం కి తనకు తెలుగు స్టార్స్ ఎవ్వరు తెలీదని చెప్పింది నిత్య మీనన్.
తెలుగు సినిమాలు చేస్తున్నాను కాబట్టి , చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ సినిమాల గురించి తెలుసుకున్నాను అని చెప్పింది నిత్య. ఆ టైం లో నాకు ప్రభాస్ అంటే ఎవరో నిజంగా తెలియదు కాని ఇప్పుడు తెలుసు అని చెప్పింది నిత్య మీనన్.చివరికి నిత్య మీనన్ , అస్సలు విషయం బయట పెట్టింది. ఇప్పటికైనా ప్రభాస్ ఫాన్స్ కోపం తగ్గించుకుంటారో లేదో చూడాలి.


No comments: