ఇప్పుడున్న హీరోలలో నెంబర్ వన్ ఎవరు అనేది పెద్ద ప్రశ్న లాగ మిగిలిపోయింది. కాని బిజినెస్ విషయం లో మాత్రం అందరి హీరోలు ఒకే రేంజ్ లో ఉండటం గమనార్హం. కాని సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒక విషయం లో టాప్ లో ఉన్నాడు.
ఇప్పుడున్న చాల మంది హీరోల కంటే మహేష్ బాబు ఎక్కువ రేమ్యునేరేషణ్ తీసుకుంటున్నాడు. తాజాగా బ్రహ్మోత్సవం సినిమా కి మహేష్ బాబు 25 కోట్ల రేమ్యునేరేషణ్ అందుకున్నాడని తెలుస్తుంది.ముందుగా ఈ సినిమా కి 20 కోట్లు తీసుకోడానికి మహేష్ బాబు ఒప్పుకున్నాడు కాని ఇప్పుడు సినిమా కి వస్తున్న ఆఫర్లను దృష్టిలో పెట్టుకొని పివిపి సంస్థ వారు మహేష్ బాబు కి 25 కోట్ల రేమ్యునేరేషణ్ ఇచ్చారని టాక్ .
ప్రస్తుతానికి షూటింగ్ దశ లో ఉన్న ఈ సినిమా ఈ మే లో విడుదల కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా ని ఇంకా లేట్ చెయ్యొద్దని మహేష్ బాబు గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా మహేష్ బాబు , టాలీవుడ్ లోనే ఎక్కువ రేమ్యునేరేషణ్ తీసుకొని హీరోగా రికార్డు సృష్టించాడు.


No comments: