రామ్ గోపాల్ వర్మ ఎం చేసిన సంచలనమే అని చెప్పాలి. రక్త చరిత్ర , కిల్లింగ్ వీరప్పన్ ఇలా చాల వివాదాస్పద సినిమాలను తెరకెక్కించిన వర్మ ఇప్పుడు కొత్తగా కుల రాజకీయాల మీద వెళ్తున్నాడు. విజయవాడ లో జరిగిన వంగవీటి రంగా హత్య ఆధారంగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి ఒక పాటను విడుదల చెయ్యడమే కాకుండా , స్టిల్స్ కూడా వదిలాడు.
ఈ సినిమా నీ త్వరలో ప్రారంభిస్తానని , ఇదే తెలుగు లో న ఆఖరి చిత్రమని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు . ఈ సినిమా కి సంబధించిన కొన్ని విషయాలు తెలుసుకోడానికి , వర్మ విజయవాడ కు వెళ్లనున్నాడు. అక్కడే కొన్ని రోజులు మకాం వేసి వంగవీటి గురించి మరి కొన్ని విషయాలు తెల్సుకోవోచ్చని వర్మ ఆలోచన.
ఈ సినిమా నీ ఈ ఏడాది మొదలు పెట్టి విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏది ఏమైనా బెజావాడ హత్యల మీద సినిమా అంటే చిన్న విషయం కాదు. రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే ఇంకో సాహసం అని చెప్పాలి. అల్ ది బెస్ట్ వర్మ సర్.


No comments: