కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన నటుడు సునీల్. అందాల రాముడు సినిమా లో కామెడీ హీరో గా నటించి అందరి అభిమానం అందుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళి హీరో వేషాలు వెయ్యడానికి వెళ్ళలేదు.మళ్ళి చాల రోజుల తర్వాత రాజమౌళి పిలిచి హీరో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత సునీల్ పూర్తిగా హీరో పాత్రలకు పరిమితం అయ్యాడు. అప్పల రాజు లాంటి ఫ్లాప్ వచ్చాక సునీల్ కొన్ని రోజులు తేరుకోలేదు.
ఇక ఈ మద్యన వచ్చిన తడాకా , భీమవరం బుల్లోడు, పూల రంగడు సినిమాలు హిట్ అయ్యాయి , కాని మిస్టర్ పెళ్లి కొడుకు మాత్రం ఫ్లాప్ అయ్యి కూర్చుంది.ఏది ఏమైనా సునీల్ మార్కెట్ మాత్రం ఒక పట్టాన తేలలేదు. ఈ మధ్యనే వచ్చిన కృష్ణాష్టమి సినిమా అటు ఇటు కాకుండా వెళుతుంది , ఈ సినిమాకి దిల్ రాజు ఓవర్ బడ్జెట్ పెట్టడనే టాక్ వినపడుతుంది . మరి సునీల్ అస్సలు మార్కెట్ ఎంత అనేది ఎవరు తెల్చలేకపోతున్నారు.
సునీల్ ప్రస్తుతానికి రెండు సినిమాలు చేస్తున్నాడు , ఇందులో " వీడు గోల్డ్ ఎహె " సినిమా కి భారి బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. ఇదే నిజం అయితే మళ్ళి సునీల్ తో ప్రయోగాలూ చేస్తున్నారు అనేది నిజం. మరి ఈసారి సునీల్ ఎం అవుతాడో చూడాలి.


No comments: