తెలంగాణ రాష్ట్ర సమితి మరొకసారి తన వేగాన్ని చూపించింది. అందరు అనుకున్నట్లుగానే టి అర్ ఎస్ భారి మెజారిటి తో నారాయణఖేడ్ ని స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే , ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి ప్రతి రౌండ్ లో టి అర్ ఎస్ ఆధిక్యం ప్రదేశిస్తూ వచ్చింది. 13 తారీకు జరిగిన పోలింగ్ లో మొత్తంగా 1,88,373 ఓటర్లు ఉండగా 1,54,866 మంది ఓట్ హక్కుని వినియోగించుకున్నారు. టి అర్ ఎస్ పార్టీ దాదాపు 53,625 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. పార్టీ వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి
టి అర్ ఎస్ : భూపాల్ రెడ్డి : 93,076
కాంగ్రెస్ : సంజీవ రెడ్డి : 39,451
టి డి పి : విజయ్ పాల్ రెడ్డి 14,717
శ్రమజీవి పార్టీ : భాస్కర్ 5,377
స్వంతంత్ర అబ్యర్థి : సంగారెడ్డికి 509
స్వంతంత్ర అబ్యర్థి : మాదప్పకు 235
స్వంతంత్ర అబ్యర్థి : వెంకటేశానికి 291
స్వంతంత్ర అబ్యర్థి :మురళీ గోవింద్కు 333


No comments: